
"ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగి పోతుంటాయి.తరంగానికి దిగువ మనకు కనపడని మరొక తరంగం వుంటుంది. ఆ తరంగశక్తే మనము చూస్తున్న తరంగాన్ని నడిపిస్తుంది.అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని ఎన్నో కథలు దాగి వుంటాయి. ఆ సాగే కథలకు పారే గోదావరి సాక్షి."
చరిత్ర చదివిన/విన్న మనందిరికి తెలిసిన సత్యం - మానవ నాగరికతకు, నీటికి చాలా దగ్గరి సంబందం వుందని. పెద్ద పెద్ద నగరాలు నీటి పక్కనే వెలిశాయని, మనిషి తన మనుగడకు ముఖ్యమైన నీటిని,భూమిని ప్రేమించడం, వాటిని పుజించడము,వాటికోసం యుద్దాలు చేయడాలు, ప్రస్తుతం చేసుకోవడాలు కూడ తెలిసినదే.
తెలుగువారు నివసించిన/నివసిస్తున్న ప్రాంతల మీద ప్రతి రచయితా ఎంతో పట్టుతో రాసిన కథలే ఈ పుస్తకాలు. ప్రదానంగా నేను చదివిన ఈ పుస్తకాలని రెండు భాగాలుగ అనుకుంటే, అవి
భూమి కథలు - తెలుగు ప్రాంతాల గురుంచి కధలు - అమరావతి,మా పసల పూడి కథలు,అగ్రహారం కథలు,తెలంగాణ కథలు,దర్గా మిట్ట కథలు,వేట కధలు,పచ్చ నాకు సాక్షిగా ... సినబ్బ కతలు,మిట్టూరోడి కతలు,అమెరికా భేతాళ కథలు
నీటి కథలు - నీరు,లంకలు, వాటి మీద అదారపడి పాత్రల కథలే - ప్రళయ కావేరి, గోదావరి కథలు,మా దిగువ గోదావరి కథలు.
బి.వి.స్.రామారావు గారు రాసిన నీటి కథలే గోదావరి కథలు .
బాపు గారి బొమ్మలతో ఎంతో బాగున్నయి గోదావరి కథలు.
గోదావరి కథలు జాబిత
1. రాగి డబ్బు
2. ఎసరు - అత్తిసరు
3. తిప్పలు
4. అది -వాడు - చేప
5. బైరాగి
6.అద్దరి - ఇద్దరి
7. ఇదం బ్రాహ్మం
8. త్రిలోక సుందరి
9. గుండెల్లో గోదావరి
10. ఆఫీసులో ఆవకాయ గోంతులో వెలక్కాయ
11. పుష్కరాల రెవులో పుల్లట్ట్లు
ఇవి వెబ్లో ఫ్రీగా చదవచ్హు - http://www.archive.org/stream/godavarikathalu019901mbp
పురాణం సుబ్రమ్మణ్య శర్మ గారి అద్భుతమైన వాఖ్యానంతో మొదలైన పుస్తకం.
నాకు నచ్హిన కథ - గుండెల్లో గోదావరి
ఇంతవరకూ చదవక పొతే - చదవండి. చదివితే ఇంకొకరితో చదివించండి.